Chandrababu: ఫర్నిచర్ పేరుతో వేధించారు... కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

  • గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
  • కోడెల కుటుంబ సభ్యులకు పరామర్శ
  • ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా చలించిపోయారు. కోడెల మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పిన చంద్రబాబు, గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచిన కోడెల భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన వెంట నారా లోకేశ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు.

ఫర్నిచర్ పేరుతో కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని చంద్రబాబు మండిపడ్డారు. చివరికి కోడెలను ఆయన కుమారుడే హత్య చేసినట్టు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు రేపు, ఎల్లుండి కోడెలకు సంతాపం ప్రకటించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

More Telugu News