Mahesh Babu: మహేశ్ మూవీలో ప్రత్యేక గీతం చేయనని చెప్పిన సోనాక్షి సిన్హా!

  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు 
  • చకచకా జరుగుతోన్న షూటింగ్ 
  • తమన్నా ఎంపికకి ముందు జరిగిందిదే

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. మహేశ్ స్టైల్ .. అనిల్ రావిపూడి మార్కుకి తగినట్టుగానే ఈ సినిమా సాగుతుందట. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనున్న సంగతి తెలిసిందే.

ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం సోనాక్షి సిన్హాను సంప్రదించారట. సాంగ్ తనకి పంపిస్తే వినేసి .. ఆ తరువాత తన నిర్ణయం చెబుతానని ఆమె అన్నట్టుగా సమాచారం. అయితే సాంగ్ రెడీ కాలేదని .. ఈ పాటను చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తామని అన్నారట. సాంగ్ వినకుండా తన నిర్ణయాన్ని చెప్పలేనని సోనాక్షి తేల్చి చెప్పడంతో, తమన్నాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

More Telugu News