Vizag: వైజాగ్ లో విషాద ఛాయలు... బోటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు

  • గోదావరిలో బోటు మునక
  • వైజాగ్ కు చెందిన ఆటో డ్రైవర్ కుటుంబం గల్లంతు
  • తల్లడిల్లిపోతున్న కుటుంబ సభ్యులు

గోదావరి బోటు ప్రమాదం వైజాగ్ లో విషాదం నింపింది. విశాఖపట్నం రామలక్ష్మీనగర్ కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న మధుపాడ రమణబాబు తన కుటుంబంతో కలిసి పాపికొండలు విహారయాత్రకు బయల్దేరగా, మధ్యలోనే ప్రమాదం జరిగింది. రమణబాబుతో పాటు ఆయన భార్య అరుణ, కుమారుడు అఖిలేశ్, కుమార్తె కుశాలి కూడా గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన అనంతరం ఈ నలుగురి క్షేమ సమాచారాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

More Telugu News