Odisha: ‘ఇంట్లో ఎవ్వరూ లేరు, వెంటనే వచ్చేయ్’ అంటూ ప్రియురాలి సందేశం.. ఆనందంతో వెళ్లి అడ్డంగా బుక్కైన యువకుడు!

  • ఒడిశాలోని బాలాసోర్ లో ఘటన
  • ఫేస్ బుక్ ద్వారా మొదలైన ప్రేమ
  • అమ్మాయి ఇంటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన యువకుడు

ఫేస్ బుక్ ప్రేమ బలవంతపు పెళ్లికి దారితీసింది. తమ కుమార్తెను ఆమె ప్రియుడు రహస్యంగా కలిసినవేళ ఆమె తల్లిదండ్రులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గులునియా గ్రామానికి చెందిన ఓ యువతికి, కుబాబుపట్నా గ్రామానికి చెందిన బైకుంఠ అనే యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అనంతరం వీళ్లు నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు

ఈ క్రమంలో ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. అయితే తన తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో సదరు యువతి బైకుంఠకు ఫోన్ చేసింది. ‘ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లారు. నువ్వు ఇంటికి రా’ అంటూ సందేశం పెట్టింది. దీంతో బైకుంఠ పట్టలేని సంతోషంతో బైక్ పై అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. అయితే యువకుడి రాకను గమనించిన పొరుగింటి వ్యక్తి ఒకరు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ కొట్టారు. దీంతో వీరిద్దరిని యువతి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

ఈ సందర్భంగా అమ్మాయి కుటుంబం ఊరిముందు పంచాయితీ పెట్టింది. దీంతో బైకుంఠ యువతిని పెళ్లి చేసుకోవాల్సిందేనని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో టైంపాస్ చేస్తానంటే తామూ ఒప్పుకోబోమనీ, నిజంగా తమ కుమార్తెను ప్రేమిస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబసభ్యులు కూడా స్పష్టం చేశారు. దీంతో బైకుంఠ చివరికి తన ప్రియురాలిని వివాహం చేసుకోవడంతో ఈ వివాదానికి శుభం కార్డు పడింది.

More Telugu News