Telugudesam: టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు..18న వైసీపీ లో చేరిక!

  • కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన తోట త్రిమూర్తులు
  • సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న తోట
  • వైసీపీ తూ.గో. జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టు సమాచారం

తెలుగుదేశం పార్టీని తోట త్రిమూర్తులు వీడనున్నట్టు వస్తున్న వార్తలకు తెరపడింది. టీడీపీకి ఆయన రాజీనామా చేశారు. ఈ నెల 18న వైసీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలతో ఈరోజు ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్న తోట త్రిమూర్తులు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. 

More Telugu News