Telangana: తెలంగాణలో అమిత్ షా పర్యటన లేనట్టేనా?

  • అమిత్ షాకు బిజీ షెడ్యూల్ 
  • టీ-బీజేపీ నేతలు, కార్యకర్తల నిరాశ
  • మరో బీజేపీ జాతీయ నేతను ఆహ్వానించే ప్రయత్నం

తెలంగాణలో ఈ నెల 17న కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పర్యటన ఖరారు కాలేదని తెలుస్తోంది. దీంతో, అమిత్ షా రాక కోసం ఎదురుచూస్తున్న టీ-బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరాశలో మునిగిపోయినట్టు సమాచారం. అమిత్ షా బదులు మరో జాతీయ నేతను ఆహ్వానించే ప్రయత్నాల్లో టీ-బీజేపీ నేతలు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

More Telugu News