Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మహేశ్ సినిమాలో పూజా హెగ్డే డ్యాన్స్ 
  • గోవాలో 'డిస్కో రాజా' షూటింగ్ 
  • హిందీలో భారీ ఎత్తున 'సైరా' రిలీజ్ 

*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో ఓ స్పెషల్ సాంగును ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో తమన్నా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తమన్నా బదులుగా తాజాగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
*  రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కో రాజా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ షూటింగులో కొన్ని కీలక సన్నివేశాలను గోవా పరిసరాల్లో దర్శకుడు వీఐ ఆనంద్ చిత్రీకరిస్తారు. ఇందులో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రాన్ని వివిధ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హిందీ వెర్షన్ ని సుమారు 2000 థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం. వచ్చే నెల 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.  

More Telugu News