ఇస్రో శాస్త్రవేత్తల పట్ల దేశం గర్వపడుతోంది.. మీరు అసాధారణమైన కృషి చేశారు!: ఏపీ సీఎం జగన్
- మనం చంద్రుడిని దాదాపుగా అందుకున్నాం
- ఈ చిరు అడ్డంకి మన విజయానికి పునాది కావాలి
- చంద్రయాన్-2 అవాంతరాలపై ఏపీ సీఎం జగన్
కాగా, ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ‘మనం చంద్రుడిని దాదాపుగా అందుకున్నాం. భారత్ తన శాస్త్రవేత్తల పట్ల గర్వపడుతోంది. ఇలాంటి చిరు అడ్డంకి మన విజయానికి పునాది కావాలి. భారత్ మొత్తం ఇస్రో టీమ్ కు అండగా నిలుస్తోంది. వాళ్లు చేసిన అసాధారణ, అద్భుతమైన కృషిని ప్రశంసిస్తోంది’ అని జగన్ ట్వీట్ చేశారు.