Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మణిరత్నం చిత్రంలో త్రిషకు ఛాన్స్  
  • ఎన్టీఆర్, చరణ్ లకు భారీ పారితోషికం 
  • షూటింగు ప్రారంభిస్తున్న శేఖర్ కమ్ముల

*   ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంగా తమిళ చరిత్రకు చెందిన 'పొన్నియన్ సెల్వన్' కథను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, విక్రం, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ తారలను ఎంపిక చేశారు. తాజాగా ఓ కీలక పాత్రకు కథానాయిక త్రిషను తీసుకుంటున్నట్టు సమాచారం.  
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్ లు భారీ ఎత్తున పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరు సుమారుగా 25 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే తాజా చిత్రం షూటింగ్ నేటి నుంచి జరుగుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News