L.B. Sriram: ఆ మేనరిజమ్ అక్కడి నుంచి వచ్చింది: నటుడు ఎల్బీ శ్రీరామ్

  • 'చాలా బాగుంది' మంచి గుర్తింపు తెచ్చింది 
  • ఆ మేనరిజమ్ కి మంచి మార్కులు పడ్డాయి  
  • బిందె నీళ్లకి పావలా తీసుకునేవాడన్న ఎల్బీ

తెలుగు తెరపై హాస్య నటుడిగా ఎల్బీ శ్రీరామ్ తనదైన ముద్ర వేశారు. 'చాలా బాగుంది' సినిమాలో ఆయన మేనరిజమ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ తరువాత చాలా సినిమాల్లో ఆయన ఆ మేనరిజమ్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ఆ మేనరిజమ్ గురించి ప్రస్తావించారు.

"మా ఊళ్లో ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకి భార్యాపిల్లలు లేరు. ఊళ్లో వాళ్లకి చెరువులో నుంచి బిందెతో నీళ్లు తెచ్చిపోస్తూ ఉండేవాడు. బిందెకి పావలా తీసుకునేవాడు. చెరువు దగ్గరలో వుండే ఇళ్లవాళ్లకి .. దూరంగా వుండేవారికి కూడా రేటు పావలానే. పాపం నీళ్లతో తలంతా తడిసిపోతున్నా, ఉదయం నుంచి సాయంత్రం వరకూ అలా నీళ్లు మోస్తూనే ఉండేవాడు. తనలో తనే మాట్లాడుకుంటూ వుంటాడు. ఆయన మాట్లాడే విధానాన్ని కొద్దిగా మార్చుకుని నేను ఆ మేనరిజమ్ ను తీసుకొచ్చాను. ఆ మేనరిజమ్ నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News