Andhra Pradesh: ‘గ్రామ సచివాలయం’ పరీక్ష విధులకు గైర్హాజరు.. నలుగురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్!

  • కర్నూలు జిల్లాలో ఘటన
  • ఇన్విజిలేషన్ విధులకు డుమ్మాకొట్టిన టీచర్లు
  • ఈ నెల 1న ప్రారంభమైన పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఈరోజు కొరడా ఝుళిపించారు. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు జరుగుతున్న ప్రవేశపరీక్ష ఇన్విజిలేషన్ కు గైర్హాజరు అయిన నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.

ఉపాధ్యాయులు సుల్తానా, షహనాజ్ బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1 న ప్రారంభమైన గ్రామ సచివాలయ పరీక్షలు 3, 4, 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి.

More Telugu News