Andhra Pradesh: వైసీపీ పథకాల కథలు 'ఓ స్త్రీ రేపు రా!' అన్నట్టు ఉంటాయి: నారా లోకేశ్

  • సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తామన్నారు
  • ఇప్పుడు ఏప్రిల్ లో ఇస్తామంటున్నారు!
  • చివరకు ‘ఏప్రిల్ ఫూల్ అనరు కదా!

వైసీపీ పథకాలపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ‘ఓ స్త్రీ రేపు రా!' అన్నట్టు ఆ పథకాల కథలు ఉంటాయి అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్యం’ అంటూ సంచులపై రాజన్న రాజ్యాన్ని చెక్కి మరీ ప్రచారం చేసుకున్నారని, ఆ రోజు వచ్చేసరికి సన్న బియ్యం కాస్తా నాణ్యమైన బియ్యం అయ్యాయని విమర్శించారు. సెప్టెంబర్ 1 కాస్తా వచ్చే ఏప్రిల్ అయిందని, చివరకు ‘ఏప్రిల్ ఫూల్ అనరుకదా!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం గురించి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనల ప్రతులను లోకేశ్ జతపరిచారు.

More Telugu News