Asha: మైకు దొరికితే విశ్వసనీయత అంటారు... ఇదేనా మీ బోడి విశ్వసనీయత?: జగన్ పై నారా లోకేశ్ ధ్వజం

  • ఆశా వర్కర్ల ఆందోళనపై స్పందించిన నారా లోకేశ్
  • ప్రభుత్వం ఆశా వర్కర్ల బాధలు వినడంలేదంటూ మండిపాటు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ యువనేత

ఎన్నికల సమయంలో అమ్మా ఓటు, అక్కా ఓటు, చెల్లీ ఓటు అని అందరినీ ప్రాధేయపడి ఓట్లేయించుకున్నారంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కానీ, ఓట్లేసిన ఆ మహిళలే ఇప్పుడు ఆందోళన చేస్తుంటే వాళ్ల బాధలు వినకుండా వాళ్ల కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. చేతికి మైకు దొరికితే చాలు విశ్వసనీయత అంటారు... ఇదే మీ బోడి విశ్వసనీయత? అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ఆశా వర్కర్ల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ను కూడా తన ట్వీట్ కు జత చేశారు. 'వైఎస్ జగన్ విఫలమైన ముఖ్యమంత్రి' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

More Telugu News