Aishwarya Rajesh: రాజేంద్రప్రసాద్ గారి సినిమాలో బాలనటిగా కూడా చేశాను: హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్

  • తమిళంలో పాతిక సినిమాలు చేశాను 
  • 'రాంబంటు'లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాను 
  • రాజేంద్ర ప్రసాద్ మా నాన్న గురించి చెప్పారన్న ఐశ్వర్య

తమిళంలో ఓ పాతిక సినిమాలు చేసిన ఐశ్వర్య రాజేశ్, 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆమె ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లకి వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ ను గురించి ప్రస్తావించింది.

"చాలా కాలం క్రితం నేను 'రాంబంటు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. మళ్లీ అదే రాజేంద్రప్రసాద్ గారి కూతురిగా 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మా నాన్నగారు రాజేశ్ .. రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి స్నేహితుడు. ఈ సినిమా షూటింగు జరుగుతున్న రోజుల్లో, మా నాన్నగారి గురించిన విషయాలను రాజేంద్ర ప్రసాద్ గారు చెబుతుంటే నాకు చాలా సంతోషం కలిగేది. రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేస్తుంటే, మా నాన్నగారితో కలిసి పనిచేస్తున్నట్టుగానే అనిపించింది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News