INX case: నేటితో ముగియనున్న చిదంబరం సీబీఐ కస్టడీ...బెయిల్‌పై ఉత్కంఠ

  • ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అరెస్టు
  • అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన చిద్దూ లాయర్లు
  • నేడు విచారించనున్న న్యాయస్థానం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరానికి బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణంలో అరెస్టయి గడచిన నాలుగు రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగియనుండడంతో చిదంబరానికి జెయిలా, బెయిలా అన్న అంశంపై చర్చసాగుతోంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన వెంటనే ఆయన లాయర్లు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 23న ఈ పిటిషన్‌ విచారణకు రాగా కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

దీంతో ఈ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం ఈరోజు విచారించనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో ఇప్పటికే న్యాయస్థానం అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినందున సీబీఐ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తే చిదంబరానికి ఊరట లభించినట్టే. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

More Telugu News