ముగిసిన అరుణ్ జైట్లీ అంత్యక్రియలు... కన్నీటిని ఆపుకోలేకపోయిన వెంకయ్యనాయుడు!
- ఢిల్లీ నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో జైట్లీ అంతిమసంస్కారాలు
- జైట్లీ చితికి నిప్పంటించిన కుమారుడు రోహన్
- తీవ్ర భావోద్వేగాలకు లోనైన వెంకయ్యనాయుడు!
జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని వెంకయ్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కాగా, జైట్లీ అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయపక్ష నేతలు హాజరయ్యారు.