Samantha: 'కావేరీ పిలుస్తోంది'... సమంత కీలక నిర్ణయం

  • కావేరీ నది పరిరక్షణ ఉద్యమంలో భాగమైన సమంత
  • లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం
  • విరాళాలు ఇవ్వాలంటూ అభిమానులకు పిలుపు

దక్షిణాది భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత సామాజిక కార్యక్రమాలతోనూ పేరు తెచ్చుకున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, కావేరీ నది పరిరక్షణ కోసం ముందుకొచ్చారు. ఇటీవలే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కావేరీ నది పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని సంకల్పించగా, సమంత కూడా తన వంతుగా సద్గురుకు మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, తన వెబ్ సైట్ లో విరాళాలు అందించాలంటూ ప్రకటన ఇచ్చారు. కావేరీ పిలుస్తోంది, లక్ష మొక్కలు నాటుదాం, రండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. కేవలం రూ.42 విరాళంగా అందిస్తే ఒక మొక్కను నాటినవారవుతారని సమంత వివరించారు.

More Telugu News