Aishwarya Rajesh: 'కౌసల్య కృష్ణమూర్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా

  • క్రికెట్ నేపథ్యంలో సాగే 'కౌసల్య కృష్ణమూర్తి' 
  • ప్రధాన పాత్రధారిగా ఐశ్వర్య రాజేశ్ 
  • ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు  

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాను రూపొందించారు. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ బాల్ రూమ్ లో రేపు సాయంత్రం ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా హాజరవుతారు.

ఓ కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించగా, ప్రత్యేకమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నాడు. తమిళంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, ఈ సినిమాతో తెలుగులోను తన కెరియర్ జోరందుకుంటుందని భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News