వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కిన్లే బాటిళ్లు అడగడం దారుణం: వర్ల రామయ్య
- కృష్ణా నదికి పోటెత్తిన వరదలు
- ముంపు బారినపడిన గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామం
- బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ప్రజాప్రతినిధులు
దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ లో ప్రతిస్పందించారు. "అయ్యా ఏపీ సీఎం గారూ, వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కిన్లే వాటర్ కావాలని హుకుం జారీచేయడం దారుణం. యధా రాజా తథా ప్రజ అన్నట్టుంది మీ పాలన. అసలే బాధల్లో ఉన్నవారిని కిన్లే బాటిల్ అడగడం అమానుషం. వైసీపీ వారి వ్యవహార శైలిలో బట్టబయలైంది... ఖర్మ" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.