వరద ప్రాంతాల్లో టీడీపీ నేతల పర్యటన

  • ప్రభుత్వ నిర్వాకం వల్లే పంటలు మునిగాయి
  • వరద నీటి విడుదలలో జాప్యం
  • ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని టీడీపీ నేతల డిమాండ్
కృష్ణా జిల్లాలోని వరదప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించారు. కరకట్ట ప్రాంతాలను దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర తదితరులు పరిశీలించారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే పంటలు మునిగాయని దేవినేని అన్నారు. రాజధాని గ్రామాల్లోకి వరదనీరు పంపేందుకే నీటి విడుదలలో జాప్యం జరిగిందని, ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఏపీ మంత్రులు చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగరవేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Krishna District
Telugudesam
leaders

More Telugu News