Nitya Menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నిత్యా మీనన్ కు బాలీవుడ్ ప్రశంసలు
  • ప్రభాస్ కోసం స్పెషల్ ఫ్లయిట్ 
  • ఆది, శ్రద్ధల 'జోడి' విడుదలకు రెడీ 

*   కథానాయిక నిత్యా మీనన్ తొలిసారిగా నటించిన హిందీ చిత్రం 'మిషన్ మంగళ్'కు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన తొలిరోజునే 29 కోట్లు వసూలు చేసి, ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇక ఇందులో సైంటిస్ట్ గా నటించిన నిత్యామీనన్ నటనకు బాలీవుడ్ లో మంచి రివ్యూలు, ప్రశంసలు వస్తున్నాయి.
*  ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ నగరాలకు  ప్రభాస్ వెళ్లవలసి వుంది. దీంతో నిర్మాతలు ఆయన కోసం చార్టెడ్ ఫ్లయిట్ ను బుక్ చేశారట.
*  ఆది సాయికుమార్ హీరోగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో రూపొందిన 'జోడి' చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 6న విడుదల చేయనున్నారు.

More Telugu News