Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే తల్లి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం!

  • జిల్లాలోని కొనకమిట్ల మండలంలో ఘటన
  • ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం
  • బాధితుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కొనకమిట్ల మండలం చినమనగుండం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ బైక్ పక్కకు జారిపోయింది. దీంతో ఈ బైక్ పై వెళుతున్న నారమ్మ(46) అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా, బండి నడుపుతున్న ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News