అమెరికాలో 66 కంప్యూటర్లు మటాష్.. తెలుగు విద్యార్థికి ఏడాది జైలుశిక్ష విధించిన కోర్టు!

- విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లిన విశ్వనాథం
- కంప్యూటర్లకు కిల్లర్ యూఎస్ బీ అనుసంధానం
- వైరస్ దెబ్బకు చెడిపోయిన 66 కంప్యూటర్లు
దీంతో సాంకేతిక సమస్య తలెత్తి 66 కంప్యూటర్లు చెడిపోయాయి. దీన్ని గుర్తించిన నిర్వాహకులు గతేడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విశ్వనాథ్ ను ఫిబ్రవరి 22న అరెస్ట్ చేశారు. ఈ కేసును ఏడాదికి పైగా విచారించిన అమెరికా కోర్టు విశ్వనాథ్ ఉద్దేశపూర్వకంగానే కిల్లర్ యూఎస్ బీ పోర్టుతో కంప్యూటర్లను నాశనం చేశాడని నిర్ధారించింది. ఈ నేరానికి గానూ ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.68 లక్షల జరిమానా విధించింది.