సెల్లెత్తుకెళ్లిన కొండముచ్చు... పోలీసుల వద్ద లబోదిబోమన్న బాధితుడు!

  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
  • ఆరటిపళ్లు ఇచ్చినా మొబైల్ ను వదలని మర్కటం
  • తాము మాత్రం ఏమి చేస్తామన్న పోలీసులు
తానున్న ప్రాంతంలో ఆహారం దొరకకపోతే, ఏ జంతువైనా కొండలను, అడవులను వదిలేసి గ్రామాల్లోకి జొరబడతాయి. ఈ విషయంలో మినహాయింపు లేని ఓ కొండముచ్చు, ఊర్లోకి వచ్చి, ఓ వ్యక్తి కొత్తగా కొనుక్కున్న సెల్ ఫోన్ ను పట్టుకెళ్లింది. ఆపై దాన్ని ఆసక్తిగా చూస్తూ, ఆడుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, సెల్ ఫోన్ ను అది ఇవ్వక పోవడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించి బోరుమన్నాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. ఎస్కే చాంద్ బాషా అనే వ్యక్తి, వారం కిందటే రూ. 12 వేలు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. అతని ఇంట్లోకి చొరబడిన ఓ కొండముచ్చు, చేతిలో ఉన్న సెల్‌ ఫోన్‌ లాక్కెళ్లింది. కొండముచ్చును వెంబడించిన చాంద్‌ బాషా, దానికి అరటిపళ్లు వేశాడు. ఆ పళ్లను తిన్న కొండముచ్చు, సెల్ ఫోన్ ను మాత్రం ఇవ్వలేదు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, మరింత ఆసక్తిగా దాన్ని చూసిందే తప్ప వదిలి పెట్టలేదు. దీంతో రెండు గంటలు ప్రయత్నించిన చాంద్ బాష్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు.. తాము మాత్రం ఏం చేయగలమని అంటూ, కొండముచ్చును కనిపెట్టి ఉండాలని, అది సెల్ ఫోన్ ను వదలగానే తెచ్చుకోవాలని ఉచిత సలహా ఒకటి పారేశారు. 
Go Back to Shorts
Guntur District
Langur
Police
Cell Phone

More Telugu News