Ponnala Lakshmaiah: కాంగ్రెస్ నేత పొన్నాల కుటుంబంలో విషాదం... సోదరి మనవడు దుర్మరణం

  • బైక్ పై వెళుతూ రోడ్ డివైడర్ ను ఢీకొట్టిన దృపత్
  • తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి
  • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మయ్య సోదరి మనవడు దృపత్ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దృపత్ వయసు 22 సంవత్సరాలు. బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాద్, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విప్రో సర్కిల్ వద్ద రోడ్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దృపత్ తలకు బలమైన గాయం అయింది. దాంతో అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News