Guntur District: తాడేపల్లిలో రేపు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

  • రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం
  • కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న జగన్
  • హాజరుకానున్న వైసీపీ నేతలు, నాయకులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రేపు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేతుల మీదుగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, తాడేపల్లి గ్రామంలోని ఓల్డ్ టోల్ గేట్ ఎదురుగా వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించారు. ఇందుకోసం రెండు ఎకరాల స్థలాన్ని గతంలో కొనుగోలు చేశారు.

More Telugu News