Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర

  • ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ విడుదల
  • ఇకపై జమ్ముకశ్మీర్, లడఖ్ లు కేంద్రపాలిత ప్రాంతాలు
  • జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. ఇకపై జమ్ముకశ్మీర్, లడఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పరిగణించనున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగాను, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ కొనసాగనున్నాయి.
http://egazette.nic.in/WriteReadData/2019/210407.pdf

More Telugu News