Modi: కశ్మీర్ అంశంపై నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ!

  • ఆర్టికల్ 370 రద్దుతో స్పెషల్ స్టేటస్ కోల్పోయిన జమ్ముకశ్మీర్
  • రెండు ముక్కలైన జమ్ముకశ్మీర్
  • నేటి ప్రసంగంలో కారణాలను వివరించనున్న ప్రధాని

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా చేయడానికి గల కారణాలను ప్రజలకు ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు.

మార్చి 27న మోదీ చివరి సారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగిస్తూ, శాటిలైట్ ను యాంటీ శాటిలైట్ మిస్సైల్ తో కూల్చివేసే అంశంలో భారత్ విజయం సాధించిందని దేశ ప్రజలకు ఆ సందర్భంలో ఆయన తెలిపారు. స్పేస్ టెక్నాలజీలో భారత్ మరో కీలక విజయం సాధించిందని చెప్పారు.

మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్న తరుణంలో.. మోదీ ఈరోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

More Telugu News