Virat Kohli: విరాట్ కోహ్లీ హ్యాట్రిక్... వరుసగా మూడో సారి టాస్ గెలుపు

  • విండీస్ తో మూడో టి20 మ్యాచ్
  • ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రోహిత్, జడేజా, ఖలీల్ కు విశ్రాంతి
  • కేఎల్ రాహుల్, చహర్ బ్రదర్స్ కు చోటు

వెస్టిండీస్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో కూడా టీమిండియా సారథి విరాట్ కోహ్లీనే టాస్ గెలిచాడు. ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లోనూ టాస్ నెగ్గిన కోహ్లీ, తాజాగా ప్రావిడెన్స్ లో జరగనున్న మూడో మ్యాచ్ లో కూడా టాస్ చేజిక్కించుకుని హ్యాట్రిక్ పూర్తి చేశాడు. కాగా, టాస్ నెగ్గిన అనంతరం ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు టి20 మ్యాచ్ ల్లో విజయం సాధించిన భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో ఇది నామమాత్రపు మ్యాచ్ గా మారింది. అందుకే పలువురు కొత్తవాళ్లను పరీక్షించాలని టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయించుకుంది.

రోహిత్ శర్మ, జడేజా, ఖలీల్ అహ్మద్ స్థానంలో కేఎల్ రాహుల్, దీపక్ చహర్, రాహుల్ చహర్ లకు తుదిజట్టులో స్థానం కల్పించారు. ఇక విండీస్ జట్టు ఒకే ఒక మార్పుతో బరిలో దిగుతోంది. ఖారీ పియర్రీ స్థానంలో ఫాబియెన్ అలెన్ తుది జట్టుకు ఎంపికయ్యాడు.

More Telugu News