Canada: కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

  • టొరంటో సమీపంలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి
  • మృతుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామం
  • 2012లో బీటెక్ పూర్తి చేసి కెనడా వెళ్లిన యువకుడు

కెనడాలో చదువుకుంటున్న బుస్సు జగన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇతని వయసు 29 సంవత్సరాలు. ఈ ప్రమాదం టొరంటో సమీపంలో జరిగింది. జగన్ మోహన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామం. ఈ తెలుగు యువకుడు 2012లో హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు.

More Telugu News