Ashok Kumar: ఎన్టీఆర్ గారు పిలిపించి మరీ వేషం ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేను: నటుడు అశోక్ కుమార్

  • 'రామారావుగారితో కలిసి నటించాలని వుండేది
  • ఆయన నుంచి కబురు రావడంతో వెళ్లి కలిశాను
  • తనకి ఇంద్రుడి పాత్రను ఇచ్చారన్న అశోక్ కుమార్

బుల్లితెరపై 'తెనాలి రామకృష్ణ' ధారావాహిక ద్వారా అశోక్ కుమార్ బాగా పాప్యులర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "శోభన్ బాబుగారితో .. కృష్ణగారితో .. ఏఎన్నార్ గారితో నటిస్తూ వెళ్లాను. అప్పటికే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లడం వలన ఆయనతో కలిసి నటించాలనే కోరిక నెరవేరదేమోనని అనుకుంటూ ఉండేవాడిని.

అలాంటి పరిస్థితుల్లోనే రామారావుగారు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'ను తీయడానికి రంగంలోకి దిగారు. అందులో ఒక పాత్రకిగాను ఆయన కాంపౌండ్ నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రిగా ఆయన చాలా బిజీగా వున్నారు. అయినా వెళ్లి ఆయనను కలిశాను. ఆయన తన కారులో నన్ను స్టూడియోకి తీసుకెళ్లి సెట్స్ చూపించారు. నాకు దేవేంద్రుడి పాత్ర ఇస్తున్నట్టుగా చెప్పారు. అందుకు సంబంధించిన డైలాగ్స్ ను ఆయన స్వయంగా చదివి వినిపించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News