Friends: స్నేహమంటూ యువతికి దగ్గరై, నగ్న చిత్రాలు తీసి.. వేధిస్తున్న యువకుడు!

  • డిగ్రీ చదువుతుండగా యువతితో స్నేహం
  • మత్తు మందిచ్చి నగ్న చిత్రాలు
  • వాటిని నెట్టింట పెట్టిన యువకుడు

మనిద్దరిదీ కల్మషం లేని స్నేహమని నమ్మించాడు. దగ్గరయ్యాడు. కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చి, ఆమెను నగ్నంగా చేసి ఫొటోలు తీశాడు. ఆనక వాటిని చూపించి, బెదిరించడం మొదలెట్టాడు. పరువు పోతుందన్న భయంతో వాటిని డిలీట్ చేయాలని ఆమె వేడుకోవడంతో, చేస్తున్నానని అన్నాడు. చేసినట్టుగా చూపించాడు. ఆపై అమెరికాకు వెళ్లిపోయాడు. ఆ తరువాత నెట్టింట అమ్మాయి వీడియోలు కనిపించాయి.

దీంతో అవాక్కైన ఆమె, రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, మీర్‌ పేటకు చెందిన ఓ యువతి (24)కి తొమ్మిది సంవత్సరాల క్రితం కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి డిగ్రీ చదివారు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం పెరుగగా, ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ, బయట చక్కర్లు కొట్టేవారు.

ఈ క్రమంలో ఒకసారి సదరు యువకుడు, ఆ అమ్మాయిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి, కూల్ డ్రింక్ లో మత్తు మాత్రలు కలిపిచ్చాడు. దాన్ని తాగిన ఆమె, మైకంలో ఉండగా, తన సెల్ ఫోన్ లో నగ్న దృశ్యాలను తీశాడు. ఆపై వాటిని ఆమెకు చూపించాడు. వాటిని తొలగించాలని ఆమె ప్రాధేయపడగా సరేనన్నాడు. వాటిని తొలగించానని నమ్మించి, ఆపై తన అసలు నైజాన్ని చాటాడు. వాటిని నీలిచిత్రాల వెబ్‌ సైట్లలో అప్ లోడ్ చేశాడు. వాటిని చూసిన యువతి స్నేహితురాలు విషయం చెప్పడంతో బాధితురాలు షాక్ కు గురైంది.

ప్రస్తుతం ఆ యువకుడు అమెరికాలో ఉండటంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, అతని ఐపీ అడ్రస్‌ ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఐపీ అడ్రస్ తెలియగానే, విషయం అమెరికా పోలీసులకు చేరవేస్తామని అన్నారు.

More Telugu News