karthikeya: 'గుణ 369' పైనే కార్తికేయ ఆశలు

  • 'హిప్పీ'తో ఫ్లాప్ చూసిన కార్తికేయ
  • 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 'గుణ 369' 
  • 12 కోట్ల మేర జరిగిన బిజినెస్

కార్తికేయ తాజా చిత్రంగా 'గుణ 369' రూపొందింది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ముందు కార్తికేయ చేసిన 'హిప్పీ' పరాజయం పాలైంది. అందువలన 'గుణ 369'తో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో కార్తికేయ వున్నాడు.

'అనఘ' కథానాయికగా 9 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, థియేట్రికల్ .. నాన్ థియేట్రికల్ కలుపుకుని 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్టుగా సమాచారం. కార్తికేయ చేసిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా, పెట్టుబడికంటే ఏడెనిమిది రెట్లు అధికంగా వసూలు చేసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో 'గుణ 369' కూడా ఆ స్థాయిలో వసూలు చేయాలని కార్తికేయ భావిస్తున్నాడట. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.

More Telugu News