karthikeya: నెక్స్ట్ మూవీ సొంత బ్యానర్లో చేస్తున్నాను: హీరో కార్తికేయ

  • కార్తికేయ తాజా చిత్రంగా 'గుణ 369'
  • గీతా ఆర్ట్స్ లో చేయనున్నాననేది పుకారు మాత్రమే
  •  కొత్త దర్శకుడితో చేస్తున్నానన్న కార్తికేయ  

కార్తికేయ తాజా చిత్రంగా రూపొందిన 'గుణ 369' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కార్తికేయ మాట్లాడుతూ, వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమా తరువాత నేను గీతా ఆర్ట్స్ లో చేయనున్నాననే ప్రచారం జరుగుతోంది. ఒక వేదికపై నాకు .. అల్లు అరవింద్ గారికి జరిగిన సంభాషణ కారణంగా అలా అనుకుంటున్నారు .. కానీ అలాంటిదేమీ లేదు.

'గుణ 369' తరువాత నేను చేయనున్న సినిమా ఆల్రెడీ మొదలైపోయింది. శేఖర్ విఖ్యాత్ అనే దర్శకుడితో నా సొంత బ్యానర్లోనే ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. 'శ్రీ' అనే మరో కొత్త దర్శకుడి ప్రాజెక్టును కూడా చేసే అవకాశం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News