Karanjohar: కరణ్ జొహార్ పార్టీలో బాలీవుడ్ తారల డ్రగ్స్ బాగోతం... వీడియో చూసి చెప్పాలంటున్న ఎస్ఏడీ ఎమ్మెల్యే!

  • ఇటీవల పార్టీ ఇచ్చిన కరణ్ జొహార్ 
  • హాజరైన పలువురు సెలబ్రిటీలు
  • అందరూ డ్రగ్స్ తీసుకున్నారన్న మజీందర్ సింగ్

బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు క‌ర‌ణ్ జొహార్ ఇటీవల సెలబ్రిటీ మిత్రులకు విందు ఇవ్వగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వీడియో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కరణ్ జొహార్ తన ఇంట్లో పార్టీ ఇవ్వగా, దీపికా ప‌దుకొనే, ర‌ణ‌బీర్ క‌పూర్, షాహిద్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా ద‌లాల్, మీర్జా రాజ్‌ పుత్‌, మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ త‌దిత‌రులు హాజ‌రై సందడి చేశారు.

అదే వీడియోను మరోసారి పోస్ట్ చేసిన ఎస్ఏడీ (శిరోమణి అకాలీదళ్‌) ఎమ్మెల్యే మజీందర్‌ సింగ్‌ సిర్సా సెలబ్రిటీలంతా డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించారు. వీరంతా డ్రగ్స్ తీసుకుని, ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారని, రీల్‌ లైఫ్‌కి, రియల్‌ లైఫ్‌ కి చాలా తేడా ఉంటుందని నిరూపించారని అన్నారు. వీరు డ్రగ్స్ తీసుకున్నారో లేదో వీడియో చూస్తుంటేనే తెలిసి పోతుందని అన్నారు.

More Telugu News