బస్టాండులో సోనీని గుర్తించిన యువతి!
- తెల్లవారుజామున అద్దంకిలో వదిలెళ్లిన కిడ్నాపర్
- ఆపై హైదరాబాద్ కు చేరుకున్న సోనీ
- మౌని అనే మరో యువతి చొరవతో క్షేమం
మౌనీయే తన ఫోన్ ను సోనీకి ఇచ్చి, తండ్రికి, పోలీసులకు ఫోన్ చేయించింది. ఆమెను క్షేమంగా తండ్రికి, పోలీసులకు అప్పగించే వరకూ అక్కడే ఉంది. ఆపై మీడియాతో మాట్లాడిన మౌనీ, తాను ఎంజీబీఎస్, 70వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సోనీని గుర్తించానని తెలిపింది. వెళ్లి పలకరించానని, ఎక్కడికి వెళ్లావని అడిగితే, తిరుపతికి తీసుకెళ్లాడని, ఇంకా ఎక్కడ తిప్పాడో గుర్తు లేదని చెప్పినట్టు పేర్కొంది. ఆపై పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారని, అప్పటివరకూ తాను సోనీకి తోడుగా ఉన్నానని చెప్పింది.