Andhra Pradesh: సీఎం జగన్ నిర్ణయంతో చంద్రబాబుకు మతిభ్రమించింది!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు
  • మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానన్నారు
  • కానీ మద్యపానంపై నిషేధం ఎత్తివేశారు

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దేశమంతా అమలు చేసేలా చేస్తానని కోతలు కోశారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు లిక్కర్ లాబీతో కుమ్మక్కు అయ్యారని దుయ్యబట్టారు.

చివరికి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎం జగన్ దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానంటే ఆయనకు మతిభ్రమించిందనీ, ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News