నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేజన్ల విధానం టీటీడీకి వర్తించదన్న చైర్మన్ సుబ్బారెడ్డి!

ఆంధ్రప్రదేశ్ లోని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల నుంచి టీటీడీ ధర్మకర్తల మండలికి మినహాయింపు ఇచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు.

స్వామీజీలు, మఠాధిపతుల సూచనల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మతపరమైన విభేదాలు తలెత్తకుండా తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంతకుముందు అశ్విని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
Go Back to Shorts
Andhra Pradesh
TTD
nominated posts
50 percent
reservation
YV Subba Reddy
ttd chairman
Tirumala

More Telugu News