Karnataka: పశువుల వేలాన్ని నిషేధించాలని డిమాండ్ చేసే బీజేపీ ఈ పని చేసింది!: శశిథరూర్ మండిపాటు

  • ఎమ్మెల్యేలను మాత్రం పశువుల్లా కొనుగోలు చేసింది
  • కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో డ్రామాలాడింది
  • బీజేపీ ఇంతకింతకు మూల్యం చెల్లించుకోక తప్పదు

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేసిన రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు. పశువుల వేలాన్ని నిషేధించాలని డిమాండ్ చేసే బీజేపీ, ఎమ్మెల్యేలను మాత్రం పశువుల్లా కొనుగోలు చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో డ్రామాలాడి సంకీర్ణ కూటమిని కూల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇంతకింతకు మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయని హెచ్చరించారు.

More Telugu News