Aadi saikumar: యూత్ మనసులు దోచుకునేలా 'జోడి' టీజర్

  • యువ దర్శకుడు విశ్వనాథ్ దర్శకత్వం 
  • ఆది సరసన శ్రద్ధా శ్రీనాథ్ 
  • సంగీత దర్శకుడిగా ఫణి కల్యాణ్  

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా 'జోడి' సినిమా నిర్మితమవుతోంది. యువ దర్శకుడు విశ్వనాథ్ రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. నాయకా నాయికల పరిచయం .. ఆ పరిచయం ప్రేమగా మారడం .. ప్రేమికులుగా తమదైన ప్రపంచంలో విహరించడం ఈ టీజర్ లో చూపించారు.

కంటెంట్ చూస్తుంటే యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వుంది. 'జెర్సీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. సాయి వెంకటేశ్ - పద్మజ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఆది సాయికుమార్ కి, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News