Chandrababu: అసెంబ్లీ ముందు చంద్రబాబు ధర్నా... అలర్ట్ అయిన పోలీసులు!

  • నిన్న సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • సస్పెన్షన్ ఎత్తి వేయాలని టీడీపీ ధర్నా
  • సమస్యలపై పోరాడితే సస్పెండ్ అన్యాయమన్న చంద్రబాబు

నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు తెలుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను తిరిగి అసెంబ్లీలోకి పిలవాలని, వారిపై ఉన్న సస్పెన్షన్ వేటును వెనక్కు తీసుకోవాలని ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

అయితే, ఈ మార్గం సీఎంతో పాటు మంత్రులు ప్రయాణించే మార్గం కావడంతో పోలీసులు అప్రమత్తమై, భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే సస్పెండ్ చేయడం తీవ్రమైన అన్యాయమని, తమ సభ్యులపై వేసిన వేటును వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

More Telugu News