sushma swaraj: మీరు కూడా దూరమవుతారన్న నెటిజన్‌కు వెంటనే సమాధానం ఇచ్చిన సుష్మా స్వరాజ్

  • శనివారం కన్నుమూసిన షీలా దీక్షిత్
  • ఏదో ఒక రోజు మీరు కూడా మాకు దూరమవుతారన్న నెటిజన్
  • తన మరణంపై ఊహకు ధన్యవాదాలన్న మాజీ మంత్రి

తన మరణాన్ని ఊహించిన ఓ నెటిజన్‌కు కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ దీటుగా బదులిచ్చారు. ఇటీవల మృతి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ లానే మీరు కూడా ఏదో ఒకరోజు మాకు దూరమవుతారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఆమె ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ మాజీ అధ్యక్షుడు మంగేరామ్ గార్గ్ మృతికి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో సంతాపం తెలిపిన సందర్భంగా ఓ నెటిజన్ స్పందించాడు. ఇర్ఫాన్‌ ఏ ఖాన్‌ అనే ఈ నెటిజన్ ఆదివారం ట్వీట్ చేస్తూ.. మీరు కూడా ఏదో ఒక రోజు మాకు దూరమవుతారని పేర్కొన్నాడు. అతడి ట్వీట్‌కు సుష్మ వెంటనే స్పందించారు. తన మరణం విషయంలో ఈ తరహా ఊహకు ధన్యవాదాలని బదులిచ్చారు.

 కాగా, 15 ఏళ్లపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆదివారం నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

More Telugu News