కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన 'నిమ్మకాయ'!
- చేతిలో నిమ్మకాయతో సభలో ప్రవేశించిన మంత్రి రేవణ్ణ
- చేతబడి అంటూ అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు
- సోదరుడిపై ఆరోపణలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి
దీనిపై కుమారస్వామి మండిపడ్డారు. "ఓ నిమ్మకాయ తెచ్చాడని రేవణ్ణను అనుమానిస్తున్నారా! హిందూ సంస్కృతిని నమ్మే మీరే అతడిపై దాడి చేస్తున్నారు. గుడికి వెళుతూ నిమ్మకాయ తీసుకెళ్లడం రేవణ్ణకు అలవాటు. కానీ మీరు అతడిపై చేతబడి ఆరోపణలు చేస్తున్నారు. అయినా చేతబడి చేస్తే ప్రభుత్వం నిలబడేది సాధ్యమేనా?" అంటూ నిప్పులు చెరిగారు.