Athi Varadar: తమిళనాడు ఆలయంలో తొక్కిసలాట... మృతుల్లో గుంటూరు జిల్లా మహిళ

  • కాంచీపురం అత్తివరదరాజస్వామి ఆలయంలో అపశ్రుతి 
  • భక్తుల మధ్య తొక్కిసలాటలో ముగ్గురి మృతి
  • ఐదుగురి పరిస్థితి విషమం

తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన అత్తివరదరాజస్వామి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంచీపురంలో ఉన్న అత్తివరదరాజస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుండగా, భక్తుల మధ్య తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు వదిలారు. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాంచీపురం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల్లో ఓ మహిళను గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మగా గుర్తించారు.

More Telugu News