Telangana: తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
- జగిత్యాల జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ కోరుట్ల
- నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్
- ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కోరుట్ల రెవెన్యూ డివిజన్.. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.