Sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 84 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 25 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 39,216కి పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,688 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.06%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.85%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.25%), ఓఎన్జీసీ (-1.64%), మారుతి సుజుకి (-1.38%), బజాజ్ ఆటో (-1.36%), యాక్సిస్ బ్యాంక్ (-1.19%).

More Telugu News