Sri Lanka: శ్రీలంకకు యుద్ధ నౌకను గిఫ్ట్‌గా ఇచ్చిన చైనా

  • కొలంబో చేరుకున్న 'పీ 625' నౌక 
  • ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న చైనా
  • త్వరలోనే 9 కొత్త రకం రైళ్లు కూడా

శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే క్రమంలో చైనా కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో ఓ పోర్టును నిర్మిస్తున్న చైనా.. తాజాగా ఓ యుద్ధనౌకను ఆ దేశానికి బహుమతిగా అందించింది. అలాగే, త్వరలోనే 9 కొత్త రకం రైళ్లను కూడా అందించనున్నట్టు చైనా ప్రకటించింది. ‘పీ 625’గా పిలిచే ఈ నౌక గత వారమే కొలంబో చేరుకుంది. శ్రీలంక దీనిని తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి వినియోగించే అవకాశం ఉందని సమాచారం. యుద్ధ నౌకను తమకు బహుమానంగా ఇచ్చిన చైనాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది.  

More Telugu News