Telugudesam: తారస్థాయికి విజయవాడ టీడీపీ విభేదాలు... ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నానన్న బుద్ధా వెంకన్న!

  • టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్
  • చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న నాని
  • వెనక్కు తగ్గిన బుద్ధా వెంకన్న

విజయవాడ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ట్వీట్ల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య జరుగుతున్న ఈ వార్, పార్టీలో కలకలం రేపుతుండగా, ఈ ఉదయం అది నేరుగా చంద్రబాబును తాకింది. తాను పార్టీలో ఉండాలని భావిస్తే, మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోవాలని నాని వార్నింగ్ ఇవ్వగా, బుద్ధా వెంకన్న కొంత వెనక్కు తగ్గారు.

నాని ఈ తెల్లవారుజామున పెట్టిన ట్వీట్ కు బదులుగా "బలహీన వర్గాలకు చెందన నాకు ఎంఎల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు గారికి విశ్వాస పాత్రుడిని. దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే. చంద్రబాబు గారి కోసం, పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నాను" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. బుద్ధా వెంకన్న ట్వీట్ తో ఈ వార్ ఆగిపోతుందా? లేక మరో రూపంలో కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.

More Telugu News