ahammadbad: అహ్మదాబాద్ లోని అడ్వెంచర్ పార్కులో ప్రమాదం..ఇద్దరు మృతి!

  • విరిగిపోయిన ‘డిస్కవరి జాయ్ రైడ్’ వీల్
  • 29 మందికి గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

గుజరాత్ లోని కంకారియా వద్ద ఉన్న అడ్వెంచర్ పార్కులో ప్రమాదం జరిగింది. ఈ పార్కులోని ‘డిస్కవరి జాయ్ రైడ్’ వీల్ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 29 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఎల్జీ హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని, సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ సంఘటనపై పోలీస్ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

More Telugu News