20 మంది రౌడీషీటర్లకు బులెట్ రుచిచూపిన బెంగళూరు పోలీసులు!
- నేరాలను అదుపు చేయడానికి కఠిన వైఖరి
- షూట్ చేసి అరెస్ట్ చేస్తున్న బెంగళూరు పోలీసులు
- ప్రాణం తీయడం లక్ష్యం కాదంటున్న అధికారులు
రౌడీషీటర్లను హతమార్చడం తమ ఉద్దేశం కాదని, వారిని మార్చడమే తమ లక్ష్యమని పోలీసులు అంటున్నారు. రౌడీషీటర్లు ఆకాష్ అలియాస్ మలేరియా, క్యాట్ రాజా, హేమంత్ కుమార్, శ్రీనివాస్, పప్పు, తబ్రేజ్ ఖాన్, దేవరాజు, చంద్రశేఖర్ తదితరులపై పోలీసులు కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు లగ్గెరె మునిరాజు, కుమారస్వామి, మన్సూర్ ఖాన్, నమ్ రాజ్ బసాకత్ గోవింద్ అలియాస్ రాహుల్ లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.